Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భువనగిరి ఆర్డిఓకు రైతులు వినతి

భువనగిరి ఆర్డిఓకు రైతులు వినతి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండల పరిధిలోని రాయగిరి రెవెన్యూ పరిధిలోని భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా 518 సర్వే నెంబర్ రైతులందరూ ఆర్డీవో,ఎమ్మార్వో కి వినతి పత్రం  అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. 50 సంవత్సరాల పైబడి సాగు చేస్తూ పంటలు పండిస్తూ పాత పాసు పుస్తకాలు పొంది జీవనం కొనసాగిస్తున్నాము ధరణి పోట్రల్ వచ్చిన నాటి నుండి నూతన పాస్ బుక్కులు పొందలేక ప్రస్తుత భూభారతిలో నైనా మాకు న్యాయం చేస్తారని ఎదురు చూసినామనీ ఇప్పటికీ మాకు న్యాయం జరగలేదనారు. కోర్టు కేసులో ఉందని ప్రభుత్వ అధికారులు మాకు ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించకుండా ఎన్నో ఏళ్ల నుండి భూమిని సాగు చేస్తున్న మాకు నూతన పాసు పుస్తకాలు ఇవ్వకుండా నాన్న ఇబ్బందులు పడుతున్న మమ్మల్ని ఆదుకొని ప్రభుత్వం నూతన పాస్ బుక్కులు మంజూరు చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు నీల పోశెట్టి గౌడ్, ముద్దసాని ఆశయ్య, ముద్దసాని రాములు, నీల ఓంప్రకాష్ గౌడ్, నీల పోశెట్టి , జెమిని , చుక్కల శంకరయ్య, చుక్కల దుర్గయ్య, శంకర్, శెట్టి గోపాల్, శెట్టి శ్రీకాంత్, నీల సంజీవ, నీల శంకర్, నీల ఆంజనేయులు ,నీల సాయిబాబా, బబ్బురి సుధాకర్, బబ్బూరి సురేష్ , బబ్బురి శంకర్, బబ్బూరి నందు,  బబ్బురి చిన్న శంకర్, కోట పోశయ్య, బబ్బూరి డుమ్ము కోట కిష్టయ్య, దశరథ, పబ్బాల రమేష్, పబ్బాల తులసీదాస్, ఎశబోయిన మల్లేష్ , వల్లాల లింగయ్య, ఏశబోయిన శ్రీశైలం, మాటూరు శంకర్ , కోట లక్ష్మయ్య, శెట్టి పరమేశ్, నీల భరత్, చుక్కల అశోక్ ,చుక్కల మల్లేష్, నీల దినేష్ ,బొజ్జ శ్రీనివాస్, బొజ్జ సాంబెష్ , బొజ్జ నరేష్ చుక్కల నరసింహ కోల సందీప్ గౌడ్ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -