Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెట్టుబడి సాయంతో రైతుల్లో ఆనందం 

పెట్టుబడి సాయంతో రైతుల్లో ఆనందం 

- Advertisement -

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ 
మండలంలో ఘనంగా రైతు భరోసా సంబరాలు
నవతెలంగాణ – పెద్దవంగర
: పంటల సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం నగదు విడుదల చేయడం పట్ల రైతుల్లో ఆనందం నెలకొందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. రైతు భరోసా సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్లెక్సీ లకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా 9 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేసిందని తెలిపారు. ఇప్పటివరకు కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. ఎకరాకు రూ.12 వేల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమ లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తుందని కొనియాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రంగు మురళి, పొడిశెట్టి సైదులు గౌడ్, దాసరి శ్రీనివాస్, బానోత్ సీతారాం నాయక్, తోటకూరి శ్రీనివాస్, వేముల వెంకన్న, బొమ్మెరబోయిన రాజు, ముత్తినేని శ్రీనివాస్, గద్దల ఉప్పలయ్య, రవీందర్ రెడ్డి, లింగమూర్తి, అంజయ్య, వెంకన్న, ఉపేందర్, సోమన్న, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -