వతెలంగాణ-పెద్దవూర
మండలం లోని రైతు వేదికలో మంగళవారం పోతునూర్, చలకుర్తి, పెద్దగూడెం, జయరాం తండా గ్రామాల్లో రైతులకు పంటల వైవిధ్యత పై మండల వ్యవసాయాధికారి సందీప్ రెడ్డి అవగాహన కల్పించారు. రాబోయే వర్షాకాలం లో రైతులు ఒకే రకమైన పంటలు సాగుచేయడం వల్ల భూసారం తగ్గిపోయి దిగుబడి తక్కువగా వస్తున్నదని పంట మార్పిడి చేసుకోవని తెలిపారు. వర్షాధార పంటలు సాగుచేయడం వల్ల అధిక లాభాలు గడించొచ్చని అన్నారు.రైతులు తేలికపాటి నేలల్లో వాలుకు అడ్డంగా దున్ని గింజలు విత్తుకున్నట్లయితే పంటకు ఎక్కువ కాలం తేమ లభ్య మవుతుందని, అలాగే ఆరు తడి పంటలైన మొక్కజొన్న, జొన్న, పెసర, కంది, వేరుశనగ, విత్తనాలను తెగుళ్ళ మందులతో విత్తన శుద్ధి సుకోవాలని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు కు రైతు గుర్తింపు కార్డు ఉండాలని దానికోసం నంబర్ నమోదు ప్రక్రియ ను చేస్తున్నామనితెలిపారు. దీని కోసం ప్రతి రైతు వారి ఆధార్ కార్డు, దానికి లింక్ ఉన్న మొబైల్ నంబర్ ఉన్న ఫోన్ ను తీసుకుని రావాలని మండల వ్యవసాయ అధికారి సూచించారు. ఈ కార్యక్రమం లో ఏఈఓ లు ఆంజనేయులు, మధుకర్, స్వాతి, దేవా, నరేష్,రైతులు పాల్గొన్నారు.
పంటల వైవిద్యత పై రైతులకు అవగాహన
- Advertisement -
- Advertisement -