- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్బుక్లు పొందిన రైతులకు కూడా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 15 నుండి నిధులు జమ చేయాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా పాస్ బుక్ పొందిన 85 వేల మంది రైతుల్లో 62 వేల మంది రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వ్యవసాయశాఖ అధికారులు ఈ దరఖాస్తులను పరిశీలించి, అర్హుల జాబితాను 10 రోజుల్లో విడుదల చేయనున్నారు. అర్హత పొందిన వారికి ఏప్రిల్ 15 నుంచి 20 తేదీల మధ్య రైతు భరోసా విడుదల చేయబడుతుంది.
- Advertisement -



