- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం రెండో విడత నిధులను ఏప్రిల్ రెండో వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.2,650 కోట్లు సమీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విడతలో ముఖ్యంగా 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే మొదటి విడతలో 70 లక్షల మంది రైతులకు రూ.3,590 కోట్లు జమ చేయగా, మిగిలిన వారికి మూడో విడతలో చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
- Advertisement -



