Monday, June 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలురోడ్డెక్కిన  రైతులు.!

రోడ్డెక్కిన  రైతులు.!

- Advertisement -

ధాన్యం కొనట్లేదని రోడ్డుపై గంటలపాటూ నిరసన, ఆందోళన..
భారీగా నిలిచిపోయిన వాహనాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
: మండల కేంద్రమైన తాడిచెర్లలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కొనడంలేదంటూ సోమవారం తాడిచెర్ల-మల్లారం ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇటు తాడిచెర్ల, అటు పెద్దతూండ్ల రోడ్డుకు అడ్డంగా వాహనాలు వెళ్లకుండా ట్రాక్టర్ అడ్డంపెట్టి రోడ్డుపై టెంట్ వేసి ధాన్యం కొనుగోలు చేసేంతవరకు ఆందోళన విరమించేది లేదంటూ రైతులు రోడ్డుపై బిష్మిoచి కూర్చున్నారు. ధాన్యం అమ్ముకోవడానికి కల్లంలో పోసి వారాలు గడుస్తున్నా కాంటాలు పెట్టె దిక్కులేదని మండిపడ్డారు. ఒకవైపైపు కొనుగోలు చేయక, మరోవైపు అకాల వర్షంతో ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి చివరిగింజ వరకు కొంటామని కంటితుడుపు చర్యగా చెప్పడమే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదని వాపోయారు. ఆరుగాలం కష్టపడి, ఎన్నో ప్రయసాలకు ఓర్చులోని, వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుందామని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోస్తే ధాన్యం మ్యాచర్ వచ్చిన విక్రయించడం లేదని చెబుతున్నారు. ధాన్యం తూకం వేయడానికి గన్ని సంచులు ఇచ్చి వారాలు గడుస్తున్నా హమాలీలు కాంటాలు పెట్టడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. లారీల కొరత ఉందంటూ నిర్వాహకులు కుంటి సాకులు చెబుతూ దాటవేస్తున్నట్లుగా తెలిపారు. ఇటు కొనుగోలు చేయక, అటు అకాల వర్షాలకు భయాందోళనకు గురై కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యాన్ని ప్రయివేటు దళారులకు అమ్మేందుకు కొందరు రైతులు ట్రాక్టర్లలో పోసుకొని పోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రైతుల ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు వేగంగా కొనుగోలు చేయాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -