- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి : మండలంలోని రామారెడ్డి, పోసానిపేట, కన్నాపూర్, అన్నారం, గ్రామాల్లో గల రైతు వేదికల్లో రైతు నేస్తం ప్రత్యక్ష కార్యక్రమానికి వ్యవసాయ అధికారులతో పాటు రైతులు ఆయా రైతు వేదికల్లో సోమవారం పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి భాను శ్రీ, ఏఈఓ లో శ్రీనివాస్, రాకేష్, ఆయా గ్రామాల తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -