నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ : ఖరీఫ్ సీజన్ లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అరికట్టాలని, బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరుతూ యాదగిరిగుట్ట మండలం కేంద్రంలలో తహసిల్దార్ కార్యాలయం ముందు ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా ఎ ఐ కె ఎం ఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కళ్లెపు అడవయ్య, బేజాడి కుమార్ లు పాల్గొని మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతాంగం సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతాంగ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు ఎలాంటి వ్యవసాయ ప్రణాళిక లేకుండా గత ఐదు సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారు. దీనితో రైతాంగం ఏ భూములలో ఏమీ పంటలు వేయాలో తెలియక గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా మార్కెట్లో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉండటంతో రైతాంగం కొనుగోలు చేసి మోసపోతుంది. సంవత్సరంలో కనీసం ఐదు నుండి ఆరు లక్షల ఎకరాల వరకు దిగుబడి తగ్గి నష్టపోతున్నారు. రైతాంగంకు కావలసిన విత్తనాలను 20 శాతం మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అందజేస్తుంది. దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలు విచ్చలవిడిగా నాణ్యతలేని విత్తనాలను ఉత్పత్తి చేస్తున్న వీటిపై రైతాంగం ఆధారపడుతున్నారు. నాణ్యమైన విత్తనాలను రైతాంగానికి అందించాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలని, విత్తనాలపై కార్పొరేట్, బహుళ జాతి కంపెనీల ఆధిపత్యమును అరికట్టాలని తెలియజేస్తున్నాం. 2014 నుండి విచ్చలవిడిగా రాజకీయ పార్టీలు రుణమాఫీలా ప్రకటనలు చేయడంతో బ్యాంకులు రైతాంగానికి రుణాలు ఇవ్వడంలో వెనకబడుతున్నాయి. కావున బ్యాంకు రుణాలను ఇవ్వాలని ప్రభుత్వాలు మొరపెట్టుకున్న బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. చిన్నా, సన్న కారు రైతులందరితోపాటు భూములు ఉన్న రైతులందరికీ బ్యాంకు రుణాలు ఇవ్వాలని, కౌలు రైతులతో పాటు మొత్తం రైతంగానికి ఖరీఫ్ సీజన్ లో ఎరువులు, విత్తనాలు, పురుగుమందులతో పాటు బ్యాంకు రుణాలు, వ్యవసాయ పరికరాలు ఇవ్వాలని కోరుతున్నాము. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా ఇవ్వాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐకెమ్ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పిన్నపు రెడ్డి రాఘవరెడ్డి, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, జిల్లా నాయకుడు పంజాల మురళి, అన్ రెడ్డి బాల్ రెడ్డి , వంగల మధుసూదన్ రెడ్డి, బద్దం వెంకటేష్ ,సుంచు రాములు, గండికోట దుర్గయ్య,వెంకటేష్, నర్సింహులు ,బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ ఆఫీస్ ముందు రైతుల ధర్నా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES