Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి: ఏఓ

రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి: ఏఓ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : ఆలూర్ మండలంలో ఇటీవల కొత్తగా వ్యవసాయ పట్టా పాస్‌పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాంబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, రైతు భరోసా దరఖాస్తు ఫారంతో సంబంధిత ఏఈవోలను సంప్రదించాలని సూచించారు. ఈ నెల 20వ తేదీలోపు నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని, రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -