నవతెలంగాణ – కంఠేశ్వర్ : రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో సరిపడా అందించాలి అని సీపీఐ(ఎం) జిల్లా మాజీ కార్యదర్శి, ప్రస్తుత జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ.. గత సంవత్సరం కంటే రుతుపవనాలు ముందుగా వచ్చి ప్రజల్ని ఆనందపరిచాయి. ఈ ఆనందం మర్చిపోకముందే వర్షాలు ముఖం చాటేసినాయి. రైతులు వర్షాలు బాగా కురుస్తాయి అనే ఆశతో దుక్కులు దున్ని విత్తటానికి సిద్ధం చేసి పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం వారు అందించాల్సిన ఎరువులు సరిపడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. పిఎసిఎస్ ల ద్వారా ప్రభుత్వం అందించే సబ్సిడీ ఎరువులు, విత్తనాలు ఇంకా రైతులకు అందట్లేదు. అలాగే నాసిరకం విత్తనాలు రాజ్యమేలుతున్నాయి.
విత్తన వ్యాపారస్తులు లాభాలు దండుకోవటం కోసం రైతు నిండా ముంచుతున్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారస్తులపైన పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తాం అన్న ప్రభుత్వం మర్చిపోయినట్టుంది పాపం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నకిలీ విత్తనాల స్థానంలో మంచి విత్తనాలు అమ్మేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సబ్సిడీ విత్తనాలని అందించాలి. అవి కూడా నాణ్యమైన విత్తనాలు అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. సమాజంలో 70% గా ఉన్న వ్యవసాయ కూలీలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. గతంలో వ్యవసాయ కూలీ రెట్లు నాట్లకు ఎంత, కలుపులకెంత, కోతలకెంత, నూర్పిడికి ఎంత, విత్తనాలు విత్తడానికి ఎంత అని వేతనాల పట్టికని ప్రచురించి ఓరూరు నా చాటింపు వేసి గ్రామపంచాయతీ కార్యాలయంలో అతికించేవారు.
ప్రస్తుతం ప్రభుత్వం అప్రయత్నం మానుకున్నట్టు కనిపిస్తున్నది. వెంటనే ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి కూలీలకు నిత్యవసర వస్తువుల ధరలను తట్టుకునే విధంగా కూలీ కనీస కూలీని నిర్ధారించి పోస్టర్ వేసి ఉరూరా చాటింపు వేసి గ్రామపంచాయతీలలో అతికించాలని అలాగే ఆరు గ్యారెంటీలో భాగంగా వ్యవసాయ కూలీలకు రూ.12,000 సంవత్సరాలకు ఇస్తామన్నారు వెంటనే అమలు చేయాలి. ఇతర గ్యారెంటీలని, పథకాలను కూడా అమలు చేయాలని సీపీఐ(ఎం) ప్రభుత్వాలకు సూచిస్తుంది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విగ్నేష్, తదితరులు పాల్గొన్నారు.