Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

రైతులు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ 
నవతెలంగాణ – మల్హర్ రావు
: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తిసుకొచ్చిన భూ భారతి 2025 చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సులు రైతుల సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని వళ్లెంకుంట,మల్లంపల్లి గ్రామాల్లో మండల తహసిల్దార్ రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులను అదనపు కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు.వివిధ సమస్యలపై వచ్చిన మొత్తం 405 దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు, అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం తీసుకు వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -