Sunday, June 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమల్టీనేషనల్‌ కంపెనీలతో రైతు ఆగం

మల్టీనేషనల్‌ కంపెనీలతో రైతు ఆగం

- Advertisement -

– ప్రయివేట్‌ కంపెనీల ప్రచారాలతో మోసపోవద్దు : వ్యవసాయ, రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి
– హుస్నాబాద్‌లో రెండో రోజు రైతు మహౌత్సవం
నవతెలంగాణ-హుస్నాబాద్‌రూరల్‌

మల్టీనేషనల్‌ కంపెనీల వల్ల రైతులు ఆగమౌ తున్నారని, రైతులు ఆలోచన చేసి మేలైన విత్తనాలు వాడాలని వ్యవసాయ, రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో శనివారం రెండోరోజు జరిగిన రైతు మహౌత్సవంలో ఆయన పాల్గొన్నా రు. స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం రైతుల సమావేశంలో మాట్లాడుతూ.. రైతు బిడ్డ సీఎం రేవంత్‌రెడ్డి అని, ఆయన ముఖ్యమంత్రి ఐనప్పటి నుంచి రైతుల కోసం ఆలోచన చేస్తున్నారని అన్నారు. నకిలీ సీడ్‌ వల్లే రైతులు నష్టపోతున్నారని, అందుకే రైతుకు విత్తన హక్కును కల్పించే దిశగా విత్తన చట్టం తీసుకురాబోతున్నార న్నారు. ములు గులో కొన్ని మల్టీనేషనల్‌ కంపెనీలు మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి రైతులను ఆగం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. త్వరలో విత్తన చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకొని కమిటీ వేసినట్టు చెప్పారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరామన్నారు. ఆనాడు వైఎస్‌ రుణమాఫీ చేస్తే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి మళ్లీ రైతు రుణ మాఫీ చేసి చరిత్రలో నిలిచారన్నారు. ప్రయివేటు కంపెనీల ప్రచారాలను నమ్మి రైతులు మోసపోవద్దని, సీడ్‌ కార్పొరేషన్‌ ఇచ్చే విత్తనాలే తీసుకోవాలని సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ అన్వేష్‌రెడ్డి చెప్పారు. రైతులు యంత్ర పరికరాలపై అవగాహన కల్పించుకోని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెస్టిసైడ్‌ వాడకుండానే చాలామంది రైతులు అధిక దిగుబడి సాధిస్తున్నారని తెలిపారు. సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా రైతులకు మేలైన విత్తనాలు అందిస్తున్నామ న్నారు. సీడ్‌ కార్పొరేషన్‌, యూనివర్సిటీ ద్వారా వచ్చే విత్తనాలు ఈ స్టాల్స్‌లో ఉంచామన్నారు. తాను ఒక రైతుగా చెబుతున్నానని, పంట మార్పిడి చేసి అధిక దిగుబడి సాధించాలని సూచించారు. వ్యవసాయం లో ఆధునిక పద్ధతులు తీసుకురావడానికే ఈ రైతు మహౌత్సవం నిర్వహిస్తున్నట్టు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ అన్నారు. రైతులకు అధికా రులు ప్రతి అంశంపైనా అవగాహన కల్పిస్తున్నార న్నారు. రెండ్రోజుల్లో పదివేల మంది రైతులు హాజర య్యారని తెలిపారు. 150 స్టాల్స్‌లో వ్యవసాయ పరికరాలు ఉన్నాయని చెప్పారు. బ్యాంకుల స్టాల్స్‌ కూడా ఉన్నాయని, ఎవరైనా ఈఎంఐ కింద రుణా లు పొంది యంత్రాలు తీసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, రైతు కమిషన్‌ సభ్యు లు కెవిఎన్‌ రెడ్డి, భవానీ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ కేడం లింగమూర్తి, హుస్నాబాద్‌ ఆర్డీఓ రామ్మూర్తి, ఏఎంసీ చైర్మెన్‌లు, సింగిల్‌ విండో చైర్మెన్‌ బోలిశెట్టి శివయ్య, వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, పశుసంవర్థక శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -