Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం 

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం 

- Advertisement -

తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్  దొర 
నవతెలంగాణ – తాడ్వాయి 

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వేయ్యం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర అన్నారు. బుధవారం మండల కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్   మాట్లాడుతూ   మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించి 7184 మంది రైతులకు 10,8825792 రూపాయలు, భూమి 1813763 ఎకరాలకు గాను తొమ్మిది రోజులలో రైతులకు ఇంత సాయం చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అని అన్నారు. మండల రైతులు  సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని ఓర్వలేక బురద జల్లడం సరికాదన్నారు. 

అకాల వర్షాల వల్ల నష్టం వస్తే పంటకు నష్టపరిహారం అందించాం,  నేడు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలోనే దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఏకకాలంలో రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్కుతుందని అన్నారు. రైతు భరోసా ద్వారా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు పంటకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ధరణి పోర్టల్ రద్దు చేసి భూ భారతి చట్టం తెచ్చి సాగు రైతులకు హక్కులు కల్పించింది అని అన్నారు.

అలాగే అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది అని, ఎకరానికి పది వేల చొప్పున పంట నష్టపరిహారం ఇస్తున్నాం అని అన్నారు. గత తొమ్మిది రోజుల నుండి తొమ్మిది వేల కోట్ల రూపాయలు కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి అని, ఖరీఫ్ సీజన్ పెట్టుబడి కోసం రైతుల పెద్దన్నలా సి ఎం నిలబడినందుకు, రైతుల అభివృద్ధికి అనుక్షణం ఆలోచిస్తూ రైతులకు అండగా నిలబడుతున్న పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బెజ్జురీ శ్రీనివాస్, ముక్తీ రామస్వామి, తుమ్మల మల్లేష్, భూషబోయిన రవి కుమార్, వాసం శ్రావణ్ , జైపాల్ రెడ్డి, ఎనగంటి నరేష్, జైపాల్ రెడ్డి, పోల్దాస్ రమేష్  తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -