- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ను జన్నారం మండలంలోని పలు గ్రామాల రైతులు వీక్షించారు. రైతుల ప్రయోజనం కోసం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం నిధులు విడుదల సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని పొన్కల్ రైతు వేదికలో వ్యవసాయ అధికారులు, రైతులు ప్రసంగాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మినారాయణ, ఏడీఏ అనిత, ఏవో సంగీత, ఏఈవోలు, అక్రమ్, త్రి సంధ్య దివ్య వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
- Advertisement -