- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్లోని కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న లేక్ షేర్ మాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా సీలింగ్ బోర్డులు కూలిపోవడంతో మాల్ను సందర్శించడానికి వచ్చిన పలువురు కస్టమర్లు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ సంఘటన మాల్లో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలను లేవనెత్తింది.
- Advertisement -



