- Advertisement -
నవతెలంగాణ భూపాలపల్లి: రెండు టిప్పర్ లారీలు ఢీకొన్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి సమీపంలో జరిగింది. భూపాలపల్లి వైపు వెళ్తున్న బొగ్గు లారీని.. వెనుక నుంచి మరో టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ఇది గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో అతడ్ని బయటకు తీశారు. గాయపడిన డ్రైవర్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -