- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్ర సొలాపూర్ జిల్లాలోని పంఢరపూర్–మంగళవేధ రహదారిపై సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవేధ సమీపంలో క్రూజర్ జీప్ను ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 14 ఏళ్ల బాలిక కూడా ఉంది. ముంబై–డోంబివళి ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగులు ఆలయ దర్శనాల అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -



