- Advertisement -
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం వ్యవసాయ శాఖ మార్కెట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరం పల్లి గ్రామానికి చెందిన పోత రమేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై కాటారం వైపు వస్తుండగా వెనక నుండి ఇసుక లారీ వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో అదుపుతప్పి లారీ వెనక టైర్ కింద పడడంతో రమేష్ కాలు నుజ్జు నుజ్జు అయింది. రోడ్డుపై కొట్టుమిట్టాడుతుండగా వాహనదారులు గమనించి వెంటనే 108 కు సమాచారం ఇచ్చారు. దీంతో రమేష్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -