- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన మొయినాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది. మొయినాబాద్ నుంచి శంకర్ పల్లి రూట్ లో వెళ్తున్న స్కూటీని ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ముగ్గురు మహిళల్లో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -