- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రకాశం జిల్లా చాకిచెర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. పిడుగురాళ్ల నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు నంబుల వెంకటనర్సయ్య, సుభాషిని, అభిరామ్గా గుర్తించారు.
- Advertisement -