– టోకెన్లు ఇచ్చిన రూ.2 వేల కోట్లు ఈనెలలో చెల్లించాలి
– వారంలో సీఎం రేవంత్ను కలుస్తాం ొ ఎఫ్ఏటీహెచ్ఐ చైర్మెన్ రమేష్బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.ఎనిమిది వేల కోట్ల వరకు ఉన్నాయనీ, వాటిని వెంటనే విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఏటీహెచ్ఐ) చైర్మెన్ నిమ్మటూరి రమేష్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాటిలో ఆర్థిక శాఖ టోకెన్లు ఇచ్చిన నిధులు రూ.రెండు వేల కోట్లున్నాయనీ, వాటిని ఈనెలలోనే చెల్లించాలని కోరారు. వారంరోజుల్లో సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ కోరతామనీ, కలిసిన తర్వాత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని తమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. బుధవారం హైదరాబాద్లో ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఏటీహెచ్ఐ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ 2023-24 విద్యాసంవత్సరం నుంచి ఉన్న బకాయిలను మూడు నెలల్లో విడుదల చేయాలని కోరారు. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలను ఆరు నెలల్లో చెల్లించాలని అన్నారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి నాలుగు విడతల్లో ఫీజులను ఇవ్వాలని సూచించారు. ఫీజు బకాయిలను చెల్లించాలని కోరుతూ మంత్రులు, అధికారులను కలిసి వినతిపత్రాలను సమర్పిస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులను కలిసి మద్దతు ఇవ్వాలని కోరతామని వివరించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. అందుకే విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. రైతులు, కాంట్రాక్లర్లకు డబ్బులిస్తున్నార నీ, కాలేజీలున్నాయనే సంగతి ప్రభుత్వం మరిచిపోయిందని చెప్పారు. అన్యాయం జరిగినపుడు న్యాయం కోసం కాలేజీలు కోర్టును ఆశ్రయిస్తాయని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కాలేజీలు వెళ్తాయన్నారు.
ఎఫ్ఏటీహెచ్ఐ నూతన కమిటీ ఎన్నిక
ఎఫ్ఏటీహెచ్ఐ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. చైర్మెన్గా నిమ్మటూరి రమేష్బాబు, సెక్రెటరీ జనరల్గా కోటల శంకరప్ప రవికుమార్, కోశాధికారిగా కొడాలి కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా కాటం సునీల్కుమార్, వైస్ చైర్మెన్లుగా అల్జాపూర్ శ్రీనివాస్, తుమ్మ జైపాల్రెడ్డి, ఎస్ పరమేశ్వర్రెడ్డి, రేపాక ప్రదీప్రెడ్డి, చలసాని సాంబశివరావు, నీల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు గా గుర్రం నాగయ్య, ముద్దసాని రమేష్రెడ్డి, పుల్లా రమేష్బా బు, గోపగాని వెంకట నారాయణ, శ్రీనివాస్ ఆచార్య తాడూరి, మహమ్మద్ గౌస్ మొయినుద్దీన్తోపాటు మీడ ియా కార్యదర్శులు, జాయింట్ సెక్రెటరీలు, ఆర్థిక కార్యదర్శు లు, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా 14 మంది ఎన్నికయ్యారు.
ఫీజు బకాయిలు రూ.8 వేల కోట్లు విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES