నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు స్కూళ్ళలో అధిక ఫీజులను నివారించాలని ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ లోని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ నాయకులు సురుపంగ చందు మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్ళలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పేరెంట్స్ కమిటీ సూచనల మేరకు ఫీజులను తీసుకోవాలని, పుస్తకాలను స్కూళ్ళలో విక్రయించకూడదని, ఫిట్ నెస్ లేని బస్సులను నడపవద్దని, ఎలాంటి అనుమతులు లేని స్కూళ్లను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని, తరగతులు ప్రారంభం కాకముందే 50 శాతం ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్ధుల సంఖ్యపరంగా బోధన సిబ్బంది లేకపోవడం, విద్యార్హత లేని వారితో విద్యా బోధనలు చేస్తు విద్యార్ధుల పై జరుగుతున్న ఆర్థిక దోపిడీని అరికట్టి న్యాయమైన విద్యా హక్కులను విద్యార్థులకు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగం నాయకులు ఎండి అసద్ ఉన్నారు.
ప్రయివేటు స్కూళ్లల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి:ఎన్ఎస్ యుఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES