నవతెలంగాణ – జాన్నారం: పచ్చి రొట్ట ఎరువులు, జనులు జీలుగా లకు పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలని సర్పంచుల ఫోరం జన్నారం మండల అధ్యక్షుడు జాడి గంగాధర్ అన్నారు. గురువారం సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సంగీతకు వినతి పత్రం అందించారు. గతంలో జిలుగా జనుము విత్తనాలకు 1200 కు పైగా ఉన్న బస్తా రేట్లు ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం2400 వందలకు పైగా పెంచడం సరికాదన్నారు. పెంచిన రేట్లతో రైతులకు తీవ్ర నష్టం వాటిలే అవకాశం ఉందన్నారు. ఒక పక్క పంట సక్రమంగా రాక, పండిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇప్పటికే తీవ్ర నష్టపోయి ఉన్నారు అన్నారు. కొనుగోలు చేసిన వరి ధాన్యానికి కటింగ్ ల పేరుతో రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. అధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే పచ్చిరొట్టకు ఎరువుల కు పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనియెడల రైతులతో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మలావత్ ప్రేమ్ సింగ్ సర్పంచ్( కొత్తపేట ) హాస్టల్ తండా సర్పంచ్ బాణావత్ సంతోష నాయక్, జనగురు మల్లయ్య ఇతర రైతులు పాల్గొన్నారు.
ఎరువుల రేట్లు తగ్గించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES