– జీఎస్టీ రిజిస్ట్రేషన్లో అవినీతిపై మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ : జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి జరుగుతోందంటూ వచ్చిన ఆరోపణలపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలని క్షేత్రస్థాయి అధికారులకు మంత్రి సూచించారు. జీఎస్టీ నంబర్ను పొందేందుకు తాను అవినీతికి పాల్పడబోతున్నానంటూ వినోద్ గుప్తా అనే వ్యక్తి లింక్డిన్లో పోస్టు చేశారు. తన భార్య, కుమార్తె కలిసి నెలకొల్పిన సంస్థకు జీఎస్టీ నంబర్ కోసం తాను దరఖాస్తు చేశానని పేర్కొన్నారు. 20 రోజులు దాటినా నంబర్ రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోమార్గం లేక జీఎస్టీ నంబర్ పొందడం కోసం తాను లంచం ఇవ్వనున్నట్టు తన పోస్ట్లో పేర్కొన్నారు. వినోద్ గుప్తా పోస్టును స్క్రీన్షాట్ తీసి సీబీఐసీని ట్యాగ్ చేస్తూ ట్యాక్స్ నిపుణులు అభిషేక్ రాజారామ్ ఎక్స్లో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్గా మారింది. దీనిపై మంత్రి స్పందించాల్సి వచ్చింది. పన్ను చెల్లింపుదారులకు సేవలందించడంతో పాటు వారిని నమ్మకాన్ని చూరగొనడం కూడా ముఖ్యమన్నారు.
క్షేత్రస్థాయి సిబ్బంది పారదర్శకంగా ఉండాలి..!
- Advertisement -
- Advertisement -