నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జిల్లా కార్యవర్గం బూర వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తూ నియంతృత్వం పాలన సాగిస్తూ నిత్యవసర ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపి పేద ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో బూటక ఎన్కౌంటర్లు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని వెంటనే మావోయిస్టులతో చర్చలు జరిపి ఆపరేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతో పాటు ఇందిర ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా జూన్ 8న సిపిఐ సూర్యాపేట జిల్లా మహాసభలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు ఎల్లవుల రాములు, ఉస్తెల నారాయణరెడ్డి, ధూళిపాల ధనంజయ నాయుడు, మేకల శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, ఎల్లంల యాదగిరి, పోకల వెంకటేశ్వర్లు, హనుమంతరావు, గుండు వెంకటేశ్వర్లు, దేవరం మల్లేశ్వరి, ఎస్కే లత్తు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES