నవతెలంగాణ-భిక్కనూర్
కాంగ్రెస్ పార్టీ ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు అశోక్ క్యాన్సర్ తో పోరాడుతూ బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ ఆలీ ఆదేశాల మేరకు తక్షణ సహాయార్థం 25 వేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. అశోక్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, సీనియర్ నాయకులు కిష్టా గౌడ్, గ్రామ అధ్యక్షుడు నర్సింగ్ రావు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ యువ నాయకుడు మృతి ఆర్థిక సహాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES