- Advertisement -
చొరబాట్లపై ఉక్కుపాదం పశ్చిమ బెంగాల్ బీజేపీ మ్యానిఫెస్టో
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ శుక్రవారం మ్యానిఫెస్టో విడుదల చేసింది. బీజేపీ కనుక అధికారంలోకి వస్తే చొరబాటు దారులపై కఠిన వైఖరి అవలంబిస్తామని తెలిపింది. ప్రతి మహిళకు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 45 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏడో వేతన సంఘం ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ సంకల్ప పత్రం రైతులు, మహిళలు, యువతకు మార్గనిర్దేశం చేస్తుందన్నారు.
- Advertisement -



