చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – దుబ్బాక : సొంత గూడు లేని పేదలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు రూ.5 లక్షల ఆర్థిక చేయూతనందిస్తూ కొండంత అండగా ఉంటుందని కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి, తిమ్మాపూర్, హసన్ మీరాపూర్, పెద్దగుండవెల్లి, మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి, చెల్లాపూర్ వార్డుల్లో, దుబ్బాక మున్సిపల్ కేంద్రంలోని 1, 13, 14, 15, 16, 17, 18, 19 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ జాహ్నవి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నరేష్ తో కలిసి ఆయన పనుల్ని ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు సల్కం మల్లేష్ యాదవ్, నరేందర్, మంద శ్రీనివాస్, సాయితేజ గౌడ్, దేవేందర్, పలువురు కార్యకర్తలున్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల ఆర్థిక చేయూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES