- Advertisement -
నవతెలంగాణ –  కామారెడ్డి
బిబిపేట్కామారెడ్డి జిల్లా బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన కల్వకుంట్ల బాలరాజ్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడతో   వారి కుటుంబానికి చావు ఖర్చుల నిమిత్తం ఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిబిపేట మండల పరిషత్ మాజీ వైస్ ఎంపీపీ కప్పిరి రవీందర్ రెడ్డి, జనగామ గ్రామ మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, పాత యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

                                    

