- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్: విశ్వబ్రాహ్మణ పేద విద్యార్థిని ఎం, సహస్ర తీవ్రమైన కడుపు నొప్పితో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇటీవల తండ్రి సైతం గుండెజబ్బుతో మరణించారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న దాతలు రూ. 13 వేల సహకారం వైద్య ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు అందజేసినట్టు వివా జిల్లా అధ్యక్షులు ఆర్ గోపాలకృష్ణాచార్య మంగళవారం తెలిపారు. మరింత సాయం కోసం దాతలు స్పందించి 98 66 84 5 1 6 2 ఫోన్ పే నెంబర్ కు సహాయం అందించాలని, వీవా జిల్లా మహిళ సహధ్యక్షులు శాంతిశీల తెలిపారు.
- Advertisement -