నవతెలంగాణ – జన్నారం : జన్నారం గాంధీ నగర్ కు చెందిన నిరుపేద గల్ఫ్ కార్మికుడు గుండారం రాజేష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న జన్నారం గల్ఫ్ సంక్షేమ సమితి సభ్యులు, అతనికి చికిత్స అందించడం కోసం జన్నారం గల్ఫ్ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మంగళవారం రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. సందర్భంగా సంక్షేమ సమితి సభ్యులు మాట్లాడుతూ.. ఆ నిరుపేద గల్ఫ్ కార్మికున్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. దాతలు ముందుకు వచ్చి అతనికి సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎరుకల రమేష్ గౌడ్, దుమల ఎల్లయ్య,మర్రిపెల్లి అంజయ్య, శేఖర్ సింహరాజు, మ్యాకల శేఖర్, హైమద్ పాషా ఎరుకల అంజగౌడ్ తవక్కల్ కలీమ్ జునుగురు లక్ష్మణ్ సింహారాజు కిరణ్ బట్టల రాకేష్ గౌడ్ కుమ్మరి రాజు జంగిలి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
గల్ఫ్ బాధితునికి ఆర్థిక సాయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES