నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన బాల్యమిత్రుడు గుర్రం బిక్షపతి ఇటీవల గుండెపోటుతో మరణించారు. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ .. తన బాల్య స్నేహితుని కుటుంబానికి ఏదైనా సహకారం అందించాలని నిర్ణయించుకొని, అందరు కలిసి జడ్పీహెచ్ఎస్ చందుపట్లలో పదవ తరగతి వరకు విద్యను అభ్యసించిన చందుపట్ల, బండ సోమవారం, వీరవెల్లి ,గౌస్ నగర్, చీమల కొండూరు గ్రామాలకు చెందిన బాల్యమిత్రులు తన కుటుంబాన్ని పరామర్శించి, కుమార్తెల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో రూ.56వేలు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూష బోయిన నరసింహ , చిన్నం బాలేశ్వర్, గౌరారెడ్డి ,దానయ్య, ఎల్లేశం పాల్గొన్నారు.
బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES