నవతెలంగాణ -తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన ఏడూర్ల పాపమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. అంతరం వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడూర్ల పాపమ్మ చాలా మంచివారు అని, వారు మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఇర్స వడ్ల భవాని నారాయణ, ఏ సి ఎస్ డైరెక్టర్ కాయితి లింగాచారి, కాలేశ్వరం వీరాచారి, దాయ వెంకటేశ్వర్లు (కోడి), వంగరి సదయ్య గోసంగి స్వామి, వంగరి రమేష్, కోటి, దామోదర్, నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సహాయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES