– హైదరాబాద్ సనత్నగర్లో ఘటన
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్, జింకలవాడలో పేపర్ ప్లేట్స్, ధర్మకోల్స్ తయారు చేసే ‘డ్యూరో డైన్ ఇండిస్టీస్’ ఇండిస్టీలో గురువారం ఉదయం 5 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. సిబ్బంది వెంటనే అగ్నిమాపక, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. దాంతో ఐదు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని సనత్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, అగ్నిమాపక అధికారులు తెలిపారు. స్వల్పంగా ఆస్తినష్టం జరిగినట్టు చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే షార్ట్సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు.
పేపర్ ప్లేట్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
- Advertisement -
- Advertisement -