- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలు మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షలకు మొత్తం 207 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా.. మొదటి పేపర్ కు నలుగురు విద్యార్థులు గైరాజనున్నట్లు 203 మంది పరీక్షలు రాసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పండరీనాథ్ ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. మొదటి రోజు తెలుగు హిందీ సంస్కృతి పరీక్షకు సెట్ నంబర్ బి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
- Advertisement -



