Thursday, February 19, 2026
E-PAPER
Homeజిల్లాలుబాగేపల్లి సర్పంచ్ ఆవుల సవిత నరేష్ ఆధ్వర్యంలో ప్రథమ సమావేశం

బాగేపల్లి సర్పంచ్ ఆవుల సవిత నరేష్ ఆధ్వర్యంలో ప్రథమ సమావేశం

- Advertisement -

నవతెలంగాణ రెంజల్

రెంజల్ మండలం బాగేపల్లి సర్పంచ్ గా గెలుపొందిన ఆవుల సవిత నరేష్ అధ్యక్షతన మొట్టమొదటి పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అత్యవసర పనుల మరమ్మత్తులకు తీర్మానాలు చేశారు.

2500 లీటర్ల సింగిల్ ఫేస్ మోటార్ల వద్ద ట్యాంకుల మరమ్మత్తులను చేపట్టాలని, కుళాయిలకు ట్యాప్ లు ఏర్పాటు చేసుకోవాలని, కుళాయిలకు కరెంటు మోటార్లను వాడినట్లయితే వాటిని సీజ్ చేసి గ్రామపంచాయతీలో పడేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జె.జ్యోతి, కార్యదర్శి జాజు శ్రీకాంత్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -