– ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ 8న చేపమందు పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ ఇన్చార్జి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించా రు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 1.5 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసినట్టు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. తాగునీరు, టాయిలెట్స్, పార్కింగ్, క్యూలైన్లు, ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. పంపిణీ ప్రదేశంలో వీల్ చైర్లు ఏర్పాటు చేయాలన్నారు. నాలుగు హెల్త్ క్యాంపులు, నాలుగు అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. చేప మందు వేసే వాలంటీర్లకు సీపీఆర్ శిక్షణ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ సమావేశంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, రెవెన్యూ, హెల్త్, ఫైర్, వాటర్ వర్క్, ఆర్ అండ్ బి, బత్తిని కుటుంబ సభ్యులు బత్తిని అమరనాథ్ గౌడ్, గౌరీ శంకర్, చంద్రశేఖర్, శివ శంకర్, సంతోష్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
జూన్ 8న చేపమందు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES