- Advertisement -
దంపతులకు కృతజ్ఞతలు తెలిపిన ఆలయవర్గం
నవతెలంగాణ-హైదరాబాద్
సీతాఫల్మండి సికింద్రాబాద్కు చెందిన వాసగోని మహేశ్గౌడ్, సంధ్యారాణి దంపతులు శనివారం స్థానిక మల్లికార్జున స్వామి దేవాలయానికి సుమారు రూ. రెండు లక్షల విలువగల ఐదు హుండీలను విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా ఆ దంపతులకు ఆలయవర్గం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, చైర్మెన్ గంగం నరసింహారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, ధర్మకర్తలు సార్ల లింగం ఎల్లయ్య యాదవ్, ఏఈవోలు సుదర్శన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
- Advertisement -



