- Advertisement -
ఐదు సెల్ ఫోన్లు, రెండు బైకులు
రూ.21,930 సీజ్ చేసిన పోలీసులు
నవతెలంగాణ – రామారెడ్డి
పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉప్పల్ వాయి గ్రామంలో నమ్మదగిన సమాచారం మేరకు, పేకాట స్థావరంపై రైడింగ్ చేసి ఐదుగురిపై కేసు నమోదు చేసి, 2 బైకులు, 5 సెల్ ఫోన్లు, రూ 21930 సీజ్ చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని, ఎవరైనా పేకాట ఆడితే వెంటనే మాకు సమాచారం అందించాలని, సమాచార అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
- Advertisement -



