- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : మండల కేంద్రంలో ఆదివారం మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…. దేశంలో, రాష్ట్రంలో బీసీల జనాభాకు తగినట్లు రాజ్యాధికారం అందటం లేదని, వెనుకబడిన బీసీ కులాల రాజ్యాధికారం పొందేల చేయడమే మన ఆలోచన సాధన సమితి ద్వేయం అని అన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పిప్పిరి లింబాద్రి, విజయ్, బాలచందర్,, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -