- Advertisement -
నవతెలంగాణ – దామరచర్ల
మండల స్థాయి పాఠశాలల చెకుముకి టాలెంట్ పరీక్షలో దామరచర్ల శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రధమ బహుమతిని కైవసం చేసుకున్నారు. పాఠశాలకు చెందిన పి.కిరణ్ రెడ్డి, ఎ.ప్రణవ్ రెడ్డి, కె.గీతాంజలిలు చెకుముకి టాలెంట్ టెస్ట్ లో మంచి ప్రతిభను కనబరచి ప్రధమ స్థానం పొందారు. ఈ సందర్భంగా వారిని శుక్రవారం పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ లీమా మేరీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ రాణి, ఉపాధ్యాయులు భీష్మారెడ్డి, దుర్గ, సత్యనారాయణ, చంద్రశేఖర్ , శ్రీను, కిషన్, ఈశ్వర్, జాన్ పీటర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



