బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ని నెక్స్ట్ లెవల్లో ఉండేలా తమన్ ప్రయత్నిస్తున్నారు. దీని కోసం సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులతో ఇప్పటికే గూస్బంప్స్ స్కోర్ని రికార్డ్ చేశారు. తాజాగా సర్వేపల్లి సిస్టర్స్ని కూడా ఆయన పరిచయం చేస్తున్నారు. తమ డివైన్ వోకల్స్తో సర్వేపల్లి సిస్టర్స్ ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తుండగా, ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

 
                                    