ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత పవన్కళ్యాణ్ పొలిటికల్గా బాగా బిజీగా ఉండటంతో ఆయన నటిస్తున్న కొత్త సినిమాల షూటింగ్స్ గత కొంత కాలంగా నిలిచిపోయాయి. వాటిల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. ఈ సినిమా డిసెంబర్ 11, 2022న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తరువాత ఈ సినిమాకి సంబంధించి క షెడ్యూల్ మాత్రమే పూర్తయ్యింది. పవన్కళ్యాణ్ పొలిటికల్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ షూటింగ్ నిలిచిపోయింది. సుదీర్ఘ కాలంగా తరువాత పవన్కళ్యాణ్ మళ్ళీ నిమా సెట్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ నిమా త్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. మంగళవారం పవన్ కళ్యాణ్ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఆయన ఎంట్రీతో సెట్స్లో జోష్ నెలకొంది. ఈ సినిమా టింగ్ స్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. పవన్కళ్యాణ్తో పాటు సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానరర్ వీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్, ర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, స్క్రీన్ ప్లే: కె దశరథ్, రచన సహకారం: సి.చంద్రమోహన్, సినిమాటోగ్రఫీ: యనంక బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి, సిఇఓ : చెర్రీ, ఫైట్స్: రామ్ లక్ష్మణ్. ఇక పవన్కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్లో .వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాని దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
పవన్కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ పలు కారణాలతో ఇప్పటికే చాలా సార్లు విడుదల వాయిదా పడింది. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా మరోమారు వాయిదా పడింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES