- Advertisement -
న్యూఢిల్లీ : చైనాలో భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాలను ఏర్పాటు చేయటానికి, నిర్వహించడానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ప్రతిష్టాత్మకమైన మూడు సంవత్సరాల కాంట్రాక్టులను అందుకున్నట్లు బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ తెలిపింది. ప్రభుత్వాలు, దౌత్య కార్యకలాపాలకు విశ్వసనీయమైన ప్రపంచ సాంకేతిక ఆధారిత సేవల భాగస్వామి గుర్తింపు ఉందని పేర్కొంది. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందం అక్టోబర్ 14 నుండి అమలులోకి రావటంతో పాటుగా రాబోయే 3 సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని వెల్లడించింది.
- Advertisement -