- గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలి
– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతి రామ్ నాయక్
నవతెలంగాణ – కామారెడ్డి : గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలనీ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతి రామ్ నాయక్ అన్నారు. శుక్రవారం రాజంపేట మండలం షేర్ శంకర్ తండా పరిధిలోగల గిరిజనులు గత 30 సంవత్సరాల నుంచి పోడు భూముల సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారనీ, గురువారం ఆ భూమికి సంబంధించి కొంతమందికి హక్కు పత్రలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకొందరికి ఆధార్ కార్డు పొరపాటు వల్ల హక్కు పత్రం రాలేదనీ, అటువంటి భూమిని పోలీస్ బెటాలియన్ తో ఫారెస్ట్ అధికారులు ఇద్దరు సిఐలు కలిసి షేర్ శంకర్ తండాలో గల గిరిజనులను భయభ్రాంతులకు గురి చేయడం జరిగిందన్నారు. వాళ్ళు ఏమైనా తీవ్రవాదుల వాళ్లపైన ఇంత దుర్మార్గంగా కక్షగట్టి తాండ నుంచి ఎవరికి భూమి మీద రానీయకుండా కందకాలు తీసి భూమిని నాశనం చేయడం జరిగిందన్నారు. ఎవరు కూడా ఈ భూమి మీద రావద్దని దున్నుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా భూములపై వస్తే దున్నుకుంటే జైలు పాలు చేస్తామని పిడి యాక్ట్ ప్రయోగిస్తామని భయపెట్టడం జరిగిందన్నారు. సాగులో ఉన్నటువంటి అచ్చుకట్లు వేసి ఉన్న మడిలు తాండకు అతి దగ్గరలో ఉన్న భూమి అది ఫారెస్ట్ ఎట్ల అవుతుందని అన్నారు. ఇకనైనా ఆ భూమిని గిరిజనులను దక్కే విధంగా చర్యలు చేపట్టాలని శనివారం కామారెడ్డి ఆర్డిఓ నీ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. గిరిజనుల భూములు గిరిజనులకు ఇవ్వకుంటే జిల్లా వ్యాప్తంగా రైతు సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఖ్య నాయక్, బాబు, రవి, సత్య, మధు, పులియాల్ నాయక్, శంకర్ నాయక్, ఆర్య నాయక్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలనీ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతి రామ్ నాయక్ అన్నారు. శుక్రవారం రాజంపేట మండలం షేర్ శంకర్ తండా పరిధిలోగల గిరిజనులు గత 30 సంవత్సరాల నుంచి పోడు భూముల సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారనీ, గురువారం ఆ భూమికి సంబంధించి కొంతమందికి హక్కు పత్రలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకొందరికి ఆధార్ కార్డు పొరపాటు వల్ల హక్కు పత్రం రాలేదనీ, అటువంటి భూమిని పోలీస్ బెటాలియన్ తో ఫారెస్ట్ అధికారులు ఇద్దరు సిఐలు కలిసి షేర్ శంకర్ తండాలో గల గిరిజనులను భయభ్రాంతులకు గురి చేయడం జరిగిందన్నారు. వాళ్ళు ఏమైనా తీవ్రవాదుల వాళ్లపైన ఇంత దుర్మార్గంగా కక్షగట్టి తాండ నుంచి ఎవరికి భూమి మీద రానీయకుండా కందకాలు తీసి భూమిని నాశనం చేయడం జరిగిందన్నారు. ఎవరు కూడా ఈ భూమి మీద రావద్దని దున్నుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా భూములపై వస్తే దున్నుకుంటే జైలు పాలు చేస్తామని పిడి యాక్ట్ ప్రయోగిస్తామని భయపెట్టడం జరిగిందన్నారు. సాగులో ఉన్నటువంటి అచ్చుకట్లు వేసి ఉన్న మడిలు తాండకు అతి దగ్గరలో ఉన్న భూమి అది ఫారెస్ట్ ఎట్ల అవుతుందని అన్నారు. ఇకనైనా ఆ భూమిని గిరిజనులను దక్కే విధంగా చర్యలు చేపట్టాలని శనివారం కామారెడ్డి ఆర్డిఓ నీ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. గిరిజనుల భూములు గిరిజనులకు ఇవ్వకుంటే జిల్లా వ్యాప్తంగా రైతు సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఖ్య నాయక్, బాబు, రవి, సత్య, మధు, పులియాల్ నాయక్, శంకర్ నాయక్, ఆర్య నాయక్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.