- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో చిరుతపులి సంచారం గురించి ఆదివారం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో అంకాపూర్ గ్రామస్తుల సమాచారం ప్రకారం, అటవీ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్న మొత్తం కొండ ప్రాంతాన్ని గాలింపు చర్యలు చేపట్టారు . ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్, డిప్యూటీ రేంజ్ అధికారిని శ్రీనివాస్, శ్రీదేవి లు మాట్లాడుతూ.. ప్రాంతంలో చిరుతపులి ఆనవాళ్లు కనిపించలేదనీ, యాత్రికులు ఒంటరిగా పిల్లలతో ప్రయాణించవద్దని అన్నారు. సూర్యాస్తమయం తెల్లవారుజామున ఆలయ ప్రాంగణ ప్రాంతంలో యాత్రికులు గుంపుగా ప్రయాణించాలని కోరారు.
- Advertisement -