నవతెలంగాణ – కంఠేశ్వర్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టిఎన్జీవో జిల్లా కార్యాలయావరణలో సోమవారం ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్,టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం తెలంగాణ సాధించాం,అంటూ నినాదాలు చేసి అమరవీరులను స్మరించుకొని, తెలంగాణ తొలి,మలి ఉద్యమాలలో అసువులు బారిన అమరవీరుల త్యాగఫలమే నేడు మనము జరుపుకుంటున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటూ ప్రత్యేక రాష్ట్ర ప్రాముఖ్యతను టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, కేంద్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ , జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ళ నాగరాజు, చిట్టి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు అతిక్ అహ్మద్, కెపి సునీత, ప్రకాష్, పురుషోత్తం, కోశాధికారి దినేష్ బాబు, సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, ఇందిర, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ , టీఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉమా కిరణ్ ,గీతారెడ్డి, విజయలక్ష్మి, సునీల్, రాజేశ్వర్, శ్రీరాములు వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
టీఎన్జీవోఎస్ లో ఆవిర్భావ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES