నవతెలంగాణ-హైదరాబాద్ : గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి రాబోతున్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు నేతలు ఉండనున్నారు. ఈ విషయం బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. అయితే.. ఉన్నట్టుండి గులాబీ బాస్ కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకోవడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం సిట్ ముందుకు హజరైన కేసీఆర్ విచారణలో ఆరోగ్య సహకరించడం లేదని తెలిపారు. ఈ నేపద్యంలో కేసీఆర్ ఆస్పత్రికి రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంలో గులాబీ శ్రేణులు కాస్త ఆందోళనకు లోనవుతున్నాయి
