- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ బీజేపీ చీఫ్ రామచందర్ రావును బాలరాజు కలిశారు. రేపు(శనివారం) లేదా ఈనెల 11 తర్వాత కమలం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి గువ్వల బాలరాజు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
- Advertisement -