నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి జిల్లా కేంద్రంలోని 8 వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త భార్గవ్ తేజ యాక్సిడెంట్ లో మరణించగా, బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ లో భాగంగా 2 లక్షల రూపాయల చెక్కును లబ్ధిదారునికి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయడం, కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోగా సభ్యత్వ నమోదు రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును లబ్ధిదారుని తల్లి సరోజకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపులు అమరేందర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏవి కిరణ్ కుమార్ , రచ్చ శ్రీనివాసరెడ్డి, నాయకులు ఇట్టబోయిన గోపాల్, అజీముద్దీన్, రాచమల్ల సుదర్శన్ లు పాల్గొన్నారు .
బీఆర్ఎస్ ఇన్సూరెన్స్ చెక్కును లబ్ధిదారునికి అందజేసిన మాజీ ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES